జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది.
పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది.
కళ, సంస్కృతిరంగంలో ఆమె సాధించిన విజయానికిగాను 2014, జనవరి 22న కోసం సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం అందుకుంది.
ఫెమినా మిస్‌ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని ‘మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌’, ‘మిస్‌ డాన్సింగ్‌ క్వీన్‌’, ‘మిస్‌ ఫ్రెండ్‌ ఆఫ్‌ ఎర్త్‌’ టైటిళ్లను గెలుచుకుంది
డోవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, FBB (బిగ్ బజార్ వద్ద ఫ్యాషన్), డాబర్ వాటిక యాంటీ చుండ్రు షాంపూ, దుబాయ్, UAE కోసం మిలీనియం, హైపెర్ మార్కెట్, హెల్త్ డ్రింక్, మలబార్ గోల్డ్ మొదలైన సంస్థలకు బ్రాండ్ అంబాడిజర్ గా చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది.
2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం లభించింది. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది.
అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది.
ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ, వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. తెలుగు తన నటనకి అవార్డులు కూడా అందుకుంది. తాజాగా ఆమె షేర్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.