BCCI: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు గిల్ కెప్టెన్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
BCCI: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు గిల్ కెప్టెన్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శుభ్మన్ గిల్ టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్లో జరిగే ఐదు టెస్ట్ల సిరీస్కు భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్ అవ్వడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI),గిల్వైపు మొగ్గు చూపారు. గిల్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కెప్టెన్గా ఉన్నాడు. 2024లో జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు, ఇక్కడ అతను 4-1 తేడాతో సిరీస్ గెలిచాడు.
జస్ప్రీత్ బుమ్రా, టెస్ట్ వైస్-కెప్టెన్, అతని గాయాల చరిత్ర, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా కెప్టెన్సీకి పరిగణించబడలేదు. ఇది గిల్ను ముందంజలో నిలిపింది. మాజీ క్రికెటర్లు, సునీల్ గవాస్కర్ , క్రిస్ శ్రీకాంత్ వంటివారు, బుమ్రా లేదా కె.ఎల్. రాహుల్ను కెప్టెన్గా పరిగణించాలని సూచించారు, గిల్ విదేశీ టెస్ట్ రికార్డు విదేశాలలో 649 రన్స్, సగటు 19 గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
గిల్ 32 టెస్ట్ మ్యాచ్లలో 1,893 రన్స్ సాధించాడు, సగటు 35.05, ఐదు సెంచరీలు, ఏడు హాఫ్-సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో అతను మూడు టెస్ట్లలో 88 రన్స్ మాత్రమే సాధించాడు, సగటు 14.66, ఇది అతని నాయకత్వ సామర్థ్యంపై కొంత సందేహాన్ని లేవనెత్తింది. అయినప్పటికీ, IPLలో నాయకత్వ అనుభవం, వైట్-బాల్ ఫార్మాట్లలో ODIలో నెం.1 బ్యాటర్ స్థిరమైన ప్రదర్శనలు అతన్ని బలమైన అభ్యర్థిగా నిలిపాయి. BCCI సెలెక్షన్ కమిటీ జట్టును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీంఇండియా స్క్వాడ్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత (వైస్-కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్ (ఓపెనర్), కె.ఎల్. రాహుల్ (ఓపెనర్),
సాయి సుదర్శన్ (బ్యాటర్), అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటర్), కరుణ్ నాయర్ (బ్యాటర్), నీతీశ్ కుమార్ రెడ్డి (ఆల్-రౌండర్), రవీంద్ర జడేజా (ఆల్-రౌండర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్ (ఆల్-రౌండర్), శార్దుల్ ఠాకూర్ (ఆల్-రౌండర్), జస్ప్రీత్ బుమ్రా (పేసర్),
మహ్మద్ సిరాజ్ (పేసర్), మహ్మద్ షమీ (పేసర్), ప్రసిద్ధ్ కృష్ణ (పేసర్), హర్షిత్ రాణా (పేసర్), ఆకాశ్ దీప్ (పేసర్)
