India Vs England Test : విజయానికి 10 వికెట్ల దూరంలో భారత్..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది.

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ (England)తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఇండియా 364 ఆలౌట్ అయింది, ఇంగ్లండ్కు 371 రన్స్ టార్గెట్ సెట్ చేసింది.
రాహుల్( Kl Rahul)(137), రిషబ్ పంత్(Rishabh Pant)- 118 పరుగులు చేశారు.ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్ను అందుకుంది. గతంలో భారత్ (India)తరపున ఒక టెస్టు మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.
