భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ థ్రిల్ ఉంటుంది. ఈసారి ఆసియా కప్ 2025లో భారత్ మళ్లీ డామినేట్ చేసింది.

భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ థ్రిల్ ఉంటుంది. ఈసారి ఆసియా కప్ 2025లో భారత్ మళ్లీ డామినేట్ చేసింది. పాక్ 171/5 (ఫర్హాన్ 58) స్కోర్ లక్ష్యాన్ని పెట్టినా, భారత్ 6 వికెట్లతో 174/4, అభిషేక్ 74 పరుగులు, గిల్ 47 పరుగులు చేసి ఈజీ విన్ తెచ్చుకుంది. ఫక్హర్ జమాన్ ఓపెనింగ్‌లో భారత్ టార్గెట్ చేజ్ చేస్తూ 18.5 ఓవర్లలో 174/4 ద్వారా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్‌ శర్మ (74 పరుగులు, 39 బంతులు), శుభ్‌మన్ గిల్ (47 పరుగులు, 28 బంతులు) చేసి అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పారు. పాకిస్తాన్ మొదటి 10 ఓవర్లలో మంచిగా ప్రారంభించినా, మధ్య ఓవర్లలో భారత బౌలర్లు పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 15వ టీ20 మ్యాచ్. దీనికి ముందు జరిగిన 14 టీ20 మ్యాచ్‌లలో భారత్ పాకిస్తాన్‌పై 11-3 ఆధిక్యంలో ఉంది. టీ20 ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో రికార్డు 2-2తో సమంగా ఉంది. వన్డే ఫార్మాట్‌తో సహా, ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ 20 సార్లు తలపడ్డాయి, భారత్ 11 సార్లు, పాకిస్తాన్ 6 సార్లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరుపై చర్చ జరుగుతోంది. హాఫ్ సెంచరీ తరువాత ఫర్హాన్ బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్లుగా చేశాడు.

ehatv

ehatv

Next Story