ఈ రోజు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ రోజు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో రాత్రి 7:30 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ (High-Voltage Match)జరగనుంది. RCB, PBKS రెండూ లీగ్ దశలో అద్భుతంగా ఆడాయి. పంజాబ్(Punjab) 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి టాప్ స్థానంలో నిలిచింది, RCB కూడా 9 మ్యాచ్‌లు గెలిచింది కానీ నెట్ రన్ రేట్‌లో వెనుకబడింది. రెండు జట్లూ టైటిల్ కోసం గట్టిగా పోరాడే అవకాశం ఉంది. RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరింది, కానీ ఇంతవరకూ ట్రోఫీ గెలవలేదు. PBKS రెండోసారి ఫైనల్‌కు వచ్చింది, 2014 తర్వాత మళ్లీ ఈ అవకాశం. రెండు జట్లూ తమ తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి. అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఇది మ్యాచ్‌కు ఆటంకం కలిగించొచ్చు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, లీగ్ టాపర్‌గా పంజాబ్ ఫైనల్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. RCB ఫ్యాన్స్ 18 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు, కాబట్టి వాళ్లు ఈసారి కప్ కొట్టాలని ఆశిస్తున్నారు. PBKS కూడా తమ రెండో ఫైనల్‌లో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. RCB బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli)కీలకం కాగా, PBKS బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. పిచ్ కండిషన్స్, టాస్, వాతావరణం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇది రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. వర్షం వస్తే ఫైనల్ మ్యాచ్‌ బుధవారం జరగనుంది.

ehatv

ehatv

Next Story