Kohli Emotional: ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీ అమ్మకే అంకితం.. విరాట్ ఎమోషనల్..!

వడోదర వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్. న్యూజీలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి క్లాసిక్‌ ఆటను ప్రదర్శించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇది విరాట్ వన్డే కెరీర్‌లో 45వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 71వ అవార్డు కావడం విశేషం.

ఇక పోస్టు మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రెజెంటర్ హర్ష భోగ్లే మాట్లాడుతూ.. 45 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అంటే చాలా పెద్ద సంఖ్య. వాటిని ఉంచుకోవడానికి పెద్ద రూమ్‌ కావాల్సి ఉంటుంది కదా అని ప్రశ్నించాడు. దీనికి విరాట్ భావోద్వేగానికి లోనయ్యాడు.తాను ఆ అవార్డులన్నీ తన అమ్మకు పంపిస్తాను. గురుగ్రామ్‌లో ఉన్న ఆమె వాటిని ఎంతో ఇష్టంగా దగ్గర పెట్టుకుంటారు. నా విజయాలు ఆమెకు గర్వంగా అనిపిస్తాయి. అందుకే అవన్నీ అమ్మకే ఇస్తానని చెప్పాడు.

అంతర్జాతీయంగా క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయానికి వస్తే.. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతనికంటే ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 76 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. విరాట్ ఇప్పటివరకు 71 అవార్డులు సాధించాడు. వీరిద్దరి మధ్య కేవలం 5 అవార్డుల తేడా మాత్రమే ఉండటంతో త్వరలోనే ఈ రికార్డును విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story