ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా వైస్‌ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయం అయింది.

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా వైస్‌ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయం అయింది. బెకెన్‌హామ్‌లో జరిగిన టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో చోటుచేసుకుంది. రిషభ్ పంత్ (Rishabh Pant )నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, అతని ఎడమ చేతికి బంతి తాకింది, దీంతో అతను తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. టీమ్ డాక్టర్ వెంటనే అతనికి చికిత్స చేసి, గాయం స్థానంలో ఐస్ ప్యాక్ వేశారు. ఆ తర్వాత పంత్ చేతికి బ్యాండేజ్ వేశారు. రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ గాయం తీవ్రమైనది కాదని, పంత్‌ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. రిషభ్ పంత్ ఇంగ్లండ్‌( England)లో టెస్ట్ క్రికెట్‌లో రెండు సెంచరీలు ఆడాడు. ఓవల్‌లో జరిగిన 5వ టెస్ట్‌లో పంత్ తన తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. 114, 146 బంతులు, 15 ఫోర్లు, 4 సిక్సర్లు సాధించాడు. భారత్ ఫాలో-ఆన్‌లో ఉండగా, ఈ ఇన్నింగ్స్ జట్టును కీలకమైంది, అయినప్పటికీ మ్యాచ్ ఓడిపోయింది. పంత్‌ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ టీమ్ ఇండియాకు కీలకం. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదం తర్వాత అతను గాయాల నుంచి కోలుకుని 2024లో కంబ్యాక్ ఇచ్చాడు. ఒకవేళ పంత్ ఆడలేకపోతే, బ్యాకప్ కీపర్ ధ్రువ్ జురెల్ ఉన్నాడు, ఇతను ఇటీవల ఇండియా A టూర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ehatv

ehatv

Next Story