SRHvsRCB: పరుగుల పండగ.. పోరాడి ఓడిన ఆర్సీబీ
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో
- Written By: Yagnik Published Date - Tue - 16 April 24
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. 288 పరుగుల లక్ష్యఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 102, హెన్రిచ్ క్లాసెన్ 67, అబ్దుల్ సమద్ 37, మార్ క్రమ్ 32, అభిషేక్ శర్మ 34 పరుగులు చేశారు.
ఛేజింగ్ లో ఆర్సీబీ కూడా ధాటిగా ఆడింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ జోడీ దుమ్మురేపింది. వీరిద్దరూ 6.2 ఓవర్లలోనే తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేయగా, డుప్లెసిస్ 28 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. విల్ జాక్స్ 7, రజత్ పాటిదార్ 9, సౌరవ్ చౌహాన్ (0) డకౌట్ కావడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఆర్బీబీ స్కోరు 5 వికెట్లకు 122 పరుగులు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ షో మొదలైంది. దినేశ్ కార్తీక్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులు బాది 83 పరుగులు చేశాడు. మహిపాల్ లోమ్రోర్ 19, అనుజ్ రావత్ 25 (నాటౌట్) పర్వాలేదనిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, టి.నటరాజన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
-
Karnataka Sex Scandal: ప్రజ్వల్ను శ్రీకృష్ణడితో పోల్చిన మంత్రి… భగ్గమంటున్న బీజేపీ
-
Kerala Bus in London : లండన్లో కేరళ బస్సు..!
-
Hara Hara veera Mallu: హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ వచ్చాడు!
-
West Bengal : బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
Actress Syamala : గీతను ఓడించడం ఎవరి తరం కాదు.. పవన్పై నటి శ్యామల కామెంట్స్
-
YS Avinash Reddy : హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట
-
Bandla Ganesh Case: కిరాయి ఇంట్లో పాడు పనులు.. బండ్ల గణేష్పై కేసు