Lay offs: లే ఆఫ్లు ప్రకటిస్తున్న ఐటీ కంపెనీలు.. ఏఐ కోర్సులకే భవిష్యత్లో డిమాండ్..!

ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలోని ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఏఐ, ఆటోమేషన్ వల్ల రిపీటిటివ్ టాస్క్లు కోడింగ్లో సాధారణ టెస్టింగ్, డేటా ఎంట్రీ, బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆటోమేట్ కావచ్చు. లో-లెవల్ ఉద్యోగాలు.. ఎంట్రీ-లెవల్ డెవలపర్స్, సపోర్ట్ రోల్స్ కొంతమేరకు ప్రమాదంలో ఉండవచ్చు. మైక్రోసాఫ్ట్ 2025 మేలో సుమారు 3% అంటే దాదాపు 6,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది 2023 తర్వాత వారి అతిపెద్ద లే ఆఫ్. వాషింగ్టన్లోని రెడ్మండ్ హెడ్క్వార్టర్స్లో సుమారు 2,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ కోతకు గురయ్యాయి. ఇండియా ఆపరేషన్స్పై ఈ లే ఆఫ్ల ప్రభావం లేదని మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ సౌత్ ఆసియా హెడ్ పునీత్ చందోక్ తెలిపారు. గూగుల్ 2025లో రెండు, మూడు రౌండ్ల లే ఆఫ్లు చేసింది, ముఖ్యంగా దాని ప్లాట్ఫామ్స్ & డివైసెస్ యూనిట్ ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్లో.. హెచ్ఆర్, క్లౌడ్ డివిజన్లలో కొన్ని వందల ఉద్యోగాలు తొలగించింది. గూగుల్ "వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్"ను కూడా అమలు చేసింది, దీనిలో యూఎస్-బేస్డ్ ఉద్యోగులు సెవరెన్స్ ప్యాకేజీతో స్వచ్ఛందంగా వెళ్లిపోయే అవకాశం ఇచ్చారు.
ఏఐ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. ఏఐ మోడల్స్ను డెవలప్ చేయడం, ట్రైన్ చేయడం, మేనేజ్ చేయడం, ఏఐ సిస్టమ్స్కు ఎథికల్ గైడ్లైన్స్ సెట్ చేయడం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఐటీ ఉద్యోగులు ఏఐ-సంబంధిత స్కిల్స్ (ML, NLP, Deep Learning) నేర్చుకుంటే డిమాండ్లో ఉంటారు.భవిష్యత్తులో ఐటీ ఉద్యోగులు కేవలం కోడింగ్తో సరిపెట్టుకోలేరు. ఏఐ టూల్స్తో పనిచేయడం, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, బ్లాక్చైన్ వంటి టెక్నాలజీల్లో నైపుణ్యం సంపాదించాలి. ఉదాహరణకు, AWS, Azure, Google Cloud వంటి ప్లాట్ఫామ్లపై నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఐటీ రంగం ఇప్పటికీ బలంగా ఉంంది, కానీ గ్లోబల్ కాంపిటీషన్, ఏఐ ఆటోమేషన్ వల్ల మార్కెట్ మరింత కాంపిటీటివ్ అవుతుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే ఏఐ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యోగులు కంపెనీల అవసరాలకు అనుగుణంగా అప్స్కిల్ కావాలి.
