ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. ఈ లేఆఫ్స్‌ ప్రధానంగా సేల్స్‌ డివిజన్‌ను టార్గెట్‌ చేస్తాయి, అయితే ఇతర విభాగాలపై కూడా ప్రభావం పడవచ్చు. ఈ కోతలు జులైలో, కంపెనీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇది మూడో రౌండ్‌ లేఆఫ్స్‌ కాగా, మే నెలలో ఇప్పటికే 6,000 మందిని తొలగించారు. AI ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఈ ఏడాది $80 బిలియన్‌ డేటా సెంటర్స్‌ కోసం కోసం ఖర్చులు నియంత్రించే ప్రయత్నం. CEO సత్య నాదెళ్ల దీన్ని "రీఅలైన్‌మెంట్‌"గా పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో 228,000 మంది ఉన్నారు. 2023లో 10,000, 2024లో యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌, Xbox టీమ్స్‌లో 1,900 మందిని తొలగించారు. తాజాగా మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమైనట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మందిపై వేటు వేయనున్నట్లు తెలిపింది. తాజా రౌండ్‌ సేల్స్‌ విభాగంలో ఉండనున్నట్లు సంస్థ అధికారులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. అయితే, ఈ లేఆఫ్స్‌పై మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు

Updated On 19 Jun 2025 6:32 AM GMT
ehatv

ehatv

Next Story