హైదరాబాద్లో జూన్ 26వ తేదీ నుంచి 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల నిర్వహణ, అభివృద్ది పనులు చేపట్టనున్న రీత్యా మొత్తం 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

22 MMTS trains cancelled in Hyderabad for one week
హైదరాబాద్(Hyderabad)లో జూన్ 26వ తేదీ నుంచి 22 ఎంఎంటీఎస్(MMTS) సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ(South Central Railway) అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్(Secundrabad), హైదరాబాద్(Hyderabad) డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల నిర్వహణ, అభివృద్ది పనులు చేపట్టనున్న రీత్యా మొత్తం 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
లింగంపల్లి(Lingampalli) - హైదరాబాద్ 47129, 47132, 47133, 47135, 47136), హైదరాబాద్ - లింగంపల్లి 47105, 47108, 47109, 47109, 471110, ఉమ్దానగర్ - లింగంపల్లి (47165, 47211, 47214, 47157), లింగంపల్లి - ఫలక్నుమా(Falaknuma) (47189, 47179), రామచంద్రపురం(Ramachandrapuram) - ఫలక్నుమా (47177), ఫలక్నుమా-లింగంపల్లి (47158, 47156) సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు.
