హైదరాబాద్‌లోని(Hyderabad) కొన్ని ఏరియాలలో మరోసారి మంచి నీళ్లు బంద్‌ కానుకున్నాయి. మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు మూడు

హైదరాబాద్‌లోని(Hyderabad) కొన్ని ఏరియాలలో మరోసారి మంచి నీళ్లు బంద్‌ కానుకున్నాయి. మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు మూడు, నాలుగు ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్‌, కంది సబ్‌ స్టేషన్‌లలో టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. గురువారం అంటే 4వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మరుసటి రోజు అంటే శుక్రవారం 5వ తేదీ ఉదయం ఏడు గంటల వరకు మరమ్మతు పనులు జరుగుతాయి. ఈ కారణంగా 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలోని నీటి సరఫరాలో(Water supply) అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్‌ (లోప్రెజర్‌), జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్‌, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నల్లగండ్ల, చందానగర్‌, హుడా కాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాలలో తాగునీటికి అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story