బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఓ వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు.

బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఓ వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. బంజారాహిల్స్‌(Banjara Hills )రోడ్డు నెంబర్‌–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution)నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్‌రెడ్డి(Kummetha Narender Reddy), హౌస్‌ కీపింగ్‌ విధులు నిర్వర్తించే బీహార్‌(Bihar)లోని ముజఫర్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్(Anand Kumar), రాహుల్‌కుమార్‌(Rahul Kumar)లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story