ఈసారి ఏకంగా సీఎం, ఇతర మంత్రుల శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు గురిపెట్టినట్లు సమాచారం.

ఈసారి ఏకంగా సీఎం, ఇతర మంత్రుల శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు గురిపెట్టినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిపై ఆర్టీఐ ఆయుధాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రయోగిస్తున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భూ కేటాయింపులు, టెండర్ల వివరాలతో పాటు తన సొంత శాఖపై కూడా ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేస్తూ వివరాలను మంత్రి జూపల్లి సేకరిస్తున్నారట. అన్ని మంత్రిత్వ శాఖల మీద మంత్రి అనుచరులు ఆర్టీఐలు దరఖాస్తులు చేస్తున్నట్టు సమాచారం. వివరాలు ఇవ్వకపోతే అధికారులకు ఫోన్ చేసి ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత శాఖపై సైతం మంత్రి ఆర్టీఐ దాఖలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మంత్రిని నాకే సమాచారం ఇవ్వకపోతే సామాన్య ప్రజలను ఎలా సతాయిస్తున్నారో అర్థం అవుతుంది అంటూ ఆర్టీఐ అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడుతున్నారట..?










