ED Notices : తెలంగాణ ఐఏఎస్‌ అమోయ్‌కుమార్‌కు ఈడీ షాక్‌

రంగారెడ్డి జిల్లా(Ranga reddy) కలెక్టర్‌గా(Collector) పనిచేసిన ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌కు(Amoy kumar) ఈడీ నోటీసులు(ED Notices) ఇచ్చింది. రంగారెడ్డి జల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములను ధారాదత్తంగా అప్పగించారని, భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని అమోయ్‌కుమార్‌పై పలువురు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌ జిల్లా నుంచి కూడా అమోయ్‌కుమార్‌పై ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు అమోయ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అమోయ్‌కుమార్‌ విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story