హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో వృద్ధ దంపతులు తమ కుమారుడితో సహజీవనం చేస్తున్న ఒక మహిళ తమను చెప్పుతో కొడుతూ అమర్యాదగా ప్రవర్తిస్తోందని

హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో వృద్ధ దంపతులు తమ కుమారుడితో సహజీవనం చేస్తున్న ఒక మహిళ తమను చెప్పుతో కొడుతూ అమర్యాదగా ప్రవర్తిస్తోందని, అన్నం పెట్టమని అడిగితే కూడా ఆమె హింసిస్తోందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మహిళ ఊడత కొమురమ్మ(Komaramma), భర్త పేరు సమ్మ య్య(Sammaiah). పరకాల మండలం సీతారాంపూర్ (Seetharampur)గ్రామం. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని. వారసత్వంగా వచ్చిన భూమిని 1.30 ఎకరాల చొప్పున ఇద్దరికీ సమానంగా పంచామన్నారు. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నప్పుడు తమని జీవితాంతం సాదాలని చెప్పారు. కానీ, పిల్లలు ఆస్తి తీసుకున్నాక తమ ఆలనాపాలనా చూడటం లేదని... ఒక కొడుకుకు ఇబ్బందుల కారణంగా మూడు పెళ్లిళ్లు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తమ కోడలు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది. మాకు తిండి పెట్టని కొడుకులకు మా ఆస్తి ఎందుకివ్వాలి. అందుకే అధికారులకు విన్నవిస్తున్నాం.. మా ఆస్తిని మా పేర్ల పైకి మార్చండంటూ. మా ఆలనాపాలనా చూసుకున్న వారికి మా తదనంతరం ఆస్తి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
- Elder abuse in TelanganaHanumakonda collector complaintSeetharampur elder abuseelderly couple assaulteddaughter-in-law beats in-lawsdomestic violence against senior citizensTelangana family disputesenior citizens denied foodrural elder abuse caseIndian senior citizen rightsslipper assault on eldersparental property disputeneglected elderly parentsTelangana grievance meetingehatvtelangana
