ప్రణయ్ హత్య కేసులో అంతిమ తీర్పు.. అమృత సంచలన పోస్ట్ !

ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న నిందితుల్లో A2కు ఉరిశిక్ష వేసిన నల్గొండ కోర్టు మిగిలిన వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2018లో సంచలనం సృష్టించిన ఈ పరువు హత్య కేసులో తీర్పు కూడా సంచలనంగా మారింది. దీంతో ప్రణయ్ కేసు గురించి నిన్నటి నుంచి చర్చ నడుస్తోంది. అయితే ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులందరూ వచ్చి… ప్రణయ్ సమాధి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ అక్కడికి అమృత మాత్రం రాలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. 'రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్' అని రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమృత. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఇలా ఉండగా ప్రణయ్ ని 2018 లో సుపారి గ్యాంగ్‌తో అమృత తండ్రి మారుతీ రావు హత్య చేయించాడు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. A1గా ఉన్న మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated On
ehatv

ehatv

Next Story