సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.

సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ '' ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం. ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు హరీష్ రావుతో తమ ఆవేదనను వ్యక్తం చేసిన రైతులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ గోస లేదని.. మీరు నీళ్లు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం యూరియా ఇస్తలేదు, మేం పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళనలో రైతులు.
కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించినం అని గుర్తుచేసిన హరీష్ రావు. ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకొనే అధికారి లేడని అగ్రికల్చర్ అధికారులపై సీరియస్ అయిన హరీష్ రావు. పదేళ్లల్లో లేని యూరియా కొరత ఇప్పుడు వచ్చింది ఇది ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం. పదేళ్లలో కేసీఆర్ గారి హయాంలో ఎరువుల ఇబ్బంది లేదు. ప్రతి మండలానికి గోదాంలు ఏర్పాటు చేసుకొని, వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టినం. ఏ గ్రామంలో ఎరువులు ఆ గ్రామంలోని రైతులకు అందించినం. గ్రామం నుండి రైతు కాలు బయట పెట్టకుండా.. హమాలీ, ట్రాన్స్ పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృధా కాకుండా గ్రామంలోనే ఎరువులు అందిచాము. నాలుగు రోజుల నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క లారీ ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం.
దేవుడు దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపుకు నిదర్శనం. వెంటనే ఓటీపీ విధానం, ఒక బస్తా విధానంను తీసేయాలని డిమాండ్ చేస్తున్న. ఓటీపీ పేరిట రైతులను వేదిస్తున్న ప్రభుత్వం, రైతుల అవసరాల అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. ఇదేనా కాంగ్రెస్ మార్పు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, నానో యూరియా వాడాలని చెప్పడం రైతులపై రూ.500 అదనపు భారం వేయడమే, నానో యూరియాతో రైతులకు ఎకరానికి 500 రూపాయలు భారం పడుతుంది. ప్రభుత్వం సబ్సిడీ నుండి తప్పించుకోడానికి కృత్రిమ ఎరువులను సృష్టిస్తుంది.
ఎన్నికలు ఉన్నాయని బీహార్ కు ఎరువులను తరలిస్తున్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలం అయ్యారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదు. రైతుల ఉసురు ఉట్టిగా పోదు. 4 రోజుల నుండి వ్యవసాయ పనులు వృధా చేసుకొని రైతులు పడిగాపులు కాస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెపుతారు. రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీకి పోయాడు కానీ ఎరువుల కొరత తీర్చలేదు, రేవంత్ రెడ్డి తిట్లు ఎక్కువ పని తక్కువ అని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి అన్నాడు, ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు, పని కావాలి, రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస.. పని మీద లేదు, కేసీఆర్ ఉన్నపుడు ఎరువులు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఎట్లా రావని రైతులు సూటిగా అడుగుతున్నారు. వెంటనే ఓటీపీ, ఒక్క బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నా'' అంటూ ఆయన ప్రభుత్వంపై మండి పడ్డారు.
