రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఈ తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి, చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా చేస్తున్నారు. ఆర్టీఐ సమాధానం ఆధారంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌తో బట్టబయలు కాబోతున్నదన్నారు. 07-12-2023 నుంచి 26-01-2025 వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తుందని హరీష్‌రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వమని హరీష్‌రావు అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story