నువ్వు నాకు వద్దు.. చచ్చిపో అన్న భార్య.. అవమానంగా భావించి మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

నువ్వు నాకు వద్దు.. చచ్చిపో అన్న భార్య.. అవమానంగా భావించి మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో హరీశ్ (Harish)(36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరి(Kaveri)తో 2014లో వివాహం జరగగా.. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లగా.. అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండ(Thadagonda)కు వచ్చిన క్రమంలో 'నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను నా ప్రియుడితో తోనే ఉంటా' అని భర్తతో కావేరి తేల్చిచెప్పింది. దీంతో మనస్తాపం చెంది బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హరీశ్ తల్లి ఫిర్యాదు మేరకు కావేరి, రక్షణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

ehatv

ehatv

Next Story