ఆమె ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. కానీ బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె చేసే చెండాలమైన పని చేస్తోంది.

ఆమె ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. కానీ బాయ్ఫ్రెండ్తో కలిసి ఆమె చేసే చెండాలమైన పని చేస్తోంది. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఓ డ్రగ్ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ ఐటీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి సుష్మిత–ఇమాన్యుల్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ మొత్తం సుమారు రూ. 4 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక మరెంత మంది ఉన్నారో అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే సుష్మిత మాత్రం నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనతో హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా మరోసారి వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందాకు సోషల్ మీడియా నెట్వర్క్ను వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లను ఉపయోగించి కస్టమర్లను సంప్రదించడం, హోమ్ డెలివరీ తరహాలో డ్రగ్స్ సరఫరా చేయడం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులే లక్ష్యంగా డీల్స్ జరిగాయని విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను డిజిటల్ పేమెంట్స్ ద్వారా నిర్వహిస్తూ, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు తెలిపారు.


