తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి కేఏ పాల్ విరచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని ఆయన మీడియాతో అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి కేఏ పాల్ విరచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని ఆయన మీడియాతో అన్నారు. రెండేళ్లలో పూర్తిగా విఫలం అయినందుకు, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా నెరవేర్చలేదని.. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల HILT స్కాం పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి రూ.5 లక్షల కోట్ల స్కాం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట అడ్డగోలుగా ప్రజాధనం వృథా చేస్తున్నాడని.. దేశంలో దోచుకునేవారు అందరూ ఈ సమ్మిట్‌కు వస్తున్నారన్నారు. ఇటీవల HILT స్కాం మీద కోర్టులో కేసు వేశాను. త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని కేఏ పాల్ వెల్లడించారు

Updated On
ehatv

ehatv

Next Story