కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ ఏర్పాటు చేసిన జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)కు జూన్ 5, 2025న విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ ఏర్పాటు చేసిన జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)కు జూన్ 5, 2025న విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. మాజీ ఇరిగేషన్ మంత్రి టీ. హరీష్ రావు(Harish Rao), మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్(Etela Rajender) (June 9)కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ ముగ్గురూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.
మార్చి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించింది. మేడిగడ్డ(Medigadda Barrage), అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు, డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ, నిర్వహణ లోపాలు జరిగాయని విచారణ జరుపుతోంది. అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని స్తంభాలు కుంగిపోవడం ఈ విచారణకు కారణం.నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, ఆర్థిక నిర్వహణలో అవకతవకలపై దృష్టి సారించింది. 100 మందికి పైగా ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే విచారించారు. కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్(Congress), బీజేపీలు కలిసి కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, కవిత ఈ విచారణను "కాంగ్రెస్ కమిషన్" అని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) వర్గాలు కేసీఆర్, హరీష్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటెల రాజేందర్ తాను విచారణకు హాజరవుతానని, ఆర్థిక శాఖకు ప్రాజెక్టు ఆర్థిక నిర్వహణతో సంబంధం లేదని చెప్పారు. కేసీఆర్ గతంలో నరసింహ రెడ్డి కమిషన్ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసి, రాతపూర్వక సమాధానం పంపారు. ఈసారి కూడా అదే వ్యూహం అనుసరిస్తారా లేక విచారణకు హాజరవుతారా అనేది స్పష్టం కాలేదు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటు జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ (P.C.Ghose Commission)ముందు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా లేక స్వయంగా కమిషన్ ముందు ప్రత్యక్షంగా హాజరవుతారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కఈ మేరకు ఒక వివరణాత్మక నివేదికను కూడా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లేకుండానే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ప్రాజెక్టును ప్రకటించడం, కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వైనాన్ని కూడా కమిషన్ ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారికి.. ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా కేసీఆర్ లేవనెత్తే అవకాశముందని తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ కేవలం కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టులో ఒక భాగం కాగా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైనా కేసీఆర్ కమిషన్కు వివరణ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కమిషన్ విచారణకు హాజరుకానున్నట్టు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించగా, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హరీశ్రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
