KTR's emotional comments: కవిత లిక్కర్‌ కేసుపై కేటీఆర్‌ ఎమోషనల్ కామెంట్స్..!

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై KTR స్పందించారు. బీజేపీ ఆడిన రాజకీయ క్రీడలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఆర్‌ఎస్‌ బలైందని కేటీఆర్‌ అన్నారు. ఎక్స్‌వేదికగా ఆయన స్పందించారు.'' కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం పేరుతో కూల్చివేసారు, ఇదే కుంభకోణం పేరుతో అసెంబ్లీ & పార్లమెంట్ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. కవితకు ఈరోజు కోర్టులో న్యాయం దక్కింది. అదే విధంగా, మా నాయకులపై నమోదైన ప్రతి కేసు తప్పుడు, రాజకీయ ప్రేరేపిత, కల్పితమైనదని తెలుస్తోంది. ఆ నిజం బయటకు వచ్చేవరకు కాంగ్రెస్, బిజెపి నుండి ఇలాంటి తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ఆరోపణలతో నెరేటివ్‌ సృష్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఇది ఇప్పుడు “న్యూ ఇండియా”లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇక్కడ ఆరోపణలు సాక్ష్యాలను మారుస్తాయి,మీడియా కథనాలు మిగతా ప్రక్రియను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ చివరికి, న్యాయం గెలుస్తుంది'' అంటూ KTR ట్వీట్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story