రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం బయటపడింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం బయటపడింది. సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో హోమ్ గార్డు వడ్ల అనూష(Vadla Anusha) వసూళ్లకు పాల్పడుతన్నట్లు తేలింది. మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్‌(Dwaraka shekar)ను అనూష బ్లాక్‌ మెయిల్‌ చేసింది. 3 లక్షల 50 వేలు అప్పుగా తీసుకొని , తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసింది అనూష. అక్కడితో ఆగకుండా మరోసారి 5 లక్షల డిమాండ్ చేయగా పరువు కోసం ద్వారకాశేకర్‌ ఇచ్చాడు. ఇంకా అక్కడితో ఆగకుండా మరోసారి 3 లక్షలు ఇవ్వాలని అనూష డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అనుష. ఇంకా ఎవరైనా ఈ కిలేడీ హోంగార్డు బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

ehatv

ehatv

Next Story