బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకులు తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకులు తెలంగాణ భవన్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మధుసూదనాచారి, హరీష్రావు, సబితారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేక్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) పెట్టిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ (KCR)చేసిన త్యాగాలను, అభివృద్ధి గురించి వివరించారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామి చేస్తే.. అబద్ధాలలో రాష్ట్రాన్ని రేవంత్ (Revanth reddy)అగ్రగామి ఇచ్చారన్నారు. కాళేశ్వరంపై కమిషన్ వేసి బీఆర్ఎస్ చేసిన మంచి పనులను డైవర్ట్ చేయడమే అని హరీష్రావు అన్నారు. ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని చూపెట్టాలని డిమాండ్ చేశారు. దివాళా తీసిందని చెప్పేవాడు పెద్ద దివానాగాడని హరీష్రావు (Harish rao)అన్నారు. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)దూరంగా ఉండడం గమనార్హం. జాగృతి కార్యాలయంలో జాతీయజెండా, జాగృతి జెండా ఎగరవేసింది కానీ తెలంగాణ భవన్లో వేడుకలకు కవిత దూరంగా ఉన్నారు. కొందరు బీజేపీ(BJP)తో బీఆర్ఎస్ కలుస్తుందని కొందరు అంటున్నారని.. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని పరోక్షంగా కవిత వ్యాఖ్యలపై హరీష్రావు వ్యాఖ్యానించారు.
