Mother-Child Suicide: The mother who poisoned her two children.. will also be punished for eternity..!

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టిన తల్లి.. తాను విషం కలిపిన ఆహారం తిన్నది. ఈ ఘటనలో​ తల్లి ప్రసన్న(38), కూతురు మేఘన(13) మృతి చెందగా, కుమారుడు ఆశ్రిత్ రామ్(15) పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ప్రసన్న భర్త ప్రకాశ్‌ గుండెపోటుతో మృతి చెందగా.. అప్పటి నుంచి భార్య మనస్తాపానికి గురైంది. ప్రసన్న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story