సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే కొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే కొట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ''మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivas Reddy) కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi), తిరిగి ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy). గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు రాకుండా, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడ కాగా సర్దిచెప్పాలని చూసిన మంత్రి జూపల్లి. ఇటీవల భూభారతి( Bhubharati) రైతు అవగాహన సదస్సులో గొడవ కాగా మంత్రి పొంగులేటి కారులో గన్ మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలతో వెళ్ళగా ఓడిపోయిన సరితా తిరుపతయ్య ను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ వాదనకి దిగిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.కోపంతో ఊగిపోయి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి.. తానేం తక్కువ తినలేదు అంటూ ఎంపీ మీద దాడి చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి. ఊహంచని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోగా మౌనంగా ఉండిపోయాడు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు'' అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.

ehatv

ehatv

Next Story