5 thousand crores..! మున్సిపల్ ఎన్నికల ఖర్చు అక్షరాల 5 వేల కోట్లు..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. రేపు ఫలితాలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలన్నీ చూసినప్పుడు, అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అని అనిపించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలు ఒక ఫార్స్ గా కనిపించాయి. నేను ఒక నెంబర్ చెప్తాను, జస్ట్ నెంబర్ చెప్పడం కోసం చెప్పింది కాదు, దీనికి సంబంధించి లెక్కలు వేసుకుంటే నేను చెప్తున్న నెంబర్ కంటే ఎక్కువే ఉంటుంది. ఏం జరిగింది అనేది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు పెట్టిన ఖర్చు 5వేల కోట్ల రూపాయలు. 5వేల కోట్ల రూపాయలకు 100 కోట్లు ఎక్కువే ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండే పరిస్థితి లేదు. ఓ 100 -118 మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగితే 5వేల కోట్ల రూపాయలు పార్టీలు ఖర్చు చేశాయి అంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ముసుగుదన్ని నిద్రపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటర్కు, ఒక్క ఓటర్కు ఓట వేసినందుకి వచ్చిన డబ్బులు 50వేల రూపాయలకు పైగా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయ అంటే అవసరం లేదు, జస్ట్ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఫోన్ కాల్ చేసి కనుక్కోండి తెలుస్తుంది మీకు. ఒక్క ఓటర్ సంపాదన ఎన్నికల్లో ఓటు వేసినందుకు 50వేల రూపాయలకు పైగా, ఒక ఓటర్ కు 20,000 నుంచి 30,000 రూపాయలు అభ్యర్థులు పంచారు. రెండు మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కలిసి పంచిన డబ్బులు లెక్కేస్తే 50,000 రూపాయలకు పైగా ఒక్కో ఓటర్ కి అందింది. కొన్ని మున్సిపాలిటీలో రంగారెడ్డి జిల్లాలోని ఓల్డ్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మునిసిపాలిటీలో మినిమం 2000 నుంచి మొదలు పెడితే 35 వేల రూపాయల వరకు ఒక్క ఓటుకు ఖర్చు చేశారు అభ్యర్థులు. ప్రధానంగా అధికార పార్టీ, ఈవెన్ బిఆర్ఎస్ పార్టీ, కొన్ని చోట్ల ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల మొత్తంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అభ్యర్థులు పెట్టిన ఖర్చు 5వేల కోట్ల రూపాయలు. ఈ 5వేల కోట్ల రూపాయలు ఉంటే, ఈ 5వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ మున్సిపాలిటీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం పోటీ చేసిన అభ్యర్థులంతా చేసే ప్రయత్నమే కానీ, డబ్బులు ఖర్చు పెట్టి వచ్చే ఫలితం, డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన ఫలితం, డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా వచ్చిన పాలక వర్గం దేనిపైన దృష్టి పెడుతుంది అనేది ఆందోళన కలిగించే అంశం. ఓ ఓటుకి 25,000-30,000 ఇచ్చి ఒక అభ్యర్థి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను ఏం చేస్తాడు, తన సమయాన్ని, తన పదవీ కాలాన్ని, తన పరపతిని, తన అధికారాన్ని దేనికోసం ఉపయోగిస్తాడు. 25,000 పెట్టాను ఒక్కో ఓటుకి, ఓరెండు లక్షలో మూడు లక్షలో సంపాదించాలి ఒక్కో ఓటుకి, నేను పెట్టిన ఖర్చు అడిషనల్ గాని అనుకుంటారు కదా, అది రాష్ట్రానికి మంచిది కాదు కదా, మున్సిపాలిటీస్ కి మంచిది కాదు కదా, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రకరకాల రూల్స్ పెట్టింది. ఎక్కడ ఎన్నికలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రలోభాలు పెట్టే తరహాలో జరగకుండా చూస్తామంటూ చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధనలు ఒకసారి ఈ సైట్ లోకి వెళ్లి చూస్తే ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారా అనిపిస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు, స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సులు ఇంకేదో టీమ్లు ఇంతమందిని పెట్టామని చెప్తున్నారు. ఎక్కడ రూపాయ పట్టుకున్నట్టు కనపడలే, ఎక్కడైనా డబ్బులు పంచుతున్నది బయటికి వచ్చిందంటే బిఆర్ఎస్ పార్టీ పంచుతుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బయట పెట్టడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంచుతుంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బయట పెట్టడం, లేదా బిజెపీ అభ్యర్థులు బయట పెట్టడం ఇలా తప్ప ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ డబ్బుల పంపిణీని అడ్డుకున్నది ఎక్కడ కనిపించట్లే.


