Gram Panchayithi Elections: జూన్‌ ఆఖరున లేదా జూలై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలు..!

తెలంగాణలో జూన్‌ చివరి వారం జులై మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ జూన్ చివరి వారం లేదా జులై ప్రారంభంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019లో మూడు దశల్లో జరిగాయి. 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీల ఐదేళ్ల గడువు ముగిసింది, అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 12,815 గ్రామ పంచాయతీలు, 1.14 లక్షల వార్డులు ఉన్నాయి, 1.67 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు.ఎన్నికలు మూడు దశల్లో జరిగే అవకాశం ఉందని, బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తారని సమాచారం. సర్పంచ్ అభ్యర్థులకు పింక్ బ్యాలెట్ పేపర్లు, వార్డు సభ్యులకు వైట్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై దృష్టిసారించారు. బీసీ కమిషన్ నివేదిక ఫిబ్రవరి 2, 2025 నాటికి సమర్పించారు. దీనిపై కేబినెట్ కూడా చర్చించింది. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ 70 వేల బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసింది. ఈ బాక్సులను కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి తెప్పించింది. పంచాయతీల పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుండడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తోంది. గ్రామపంచాయతీలో పది లక్షల లోపు ఉన్న బిల్లులను మంజూరు చేయడంతో మాజీ సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు.. ఇప్పటికే పలు గ్రామాలలో సర్పంచ్ కు పోటీ చేసేందుకు యువత ముందుకు వస్తోంది. దీంతో గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఇది శుభవార్త.

ehatv

ehatv

Next Story