ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఈ భేటీ జ‌రిగింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. ఇటీవ‌ల ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించి చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అందించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఇటీవ‌ల‌ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ.6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్‌ విరాళం ప్రకటించారు. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు.. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story