Rahul Gandhi ji: రాహల్‌గాంధీ జీ.. ఓ ఆటో ఎక్కండి, అశోక్‌నగర్‌ వెళ్లి రండి..!

రాహల్‌గాంధీ జీ.. ఓ ఆటో ఎక్కండి, అశోక్‌నగర్‌ వెళ్లి రండి..!

ఏఐసిసి అగ్రనేత లోక్‌భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. రాహుల్ గాంధీ 2023 ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటనలు చేసి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశానికి సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు తాను పూచీ అంటూ ఆయన గ్యారెంటీ కూడా ఇచ్చారు. ఆయన మాత్రమే కాదు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారెంటీగా మేము ఉంటామంటూ చెప్తూ వచ్చారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేస్తామో చూపిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం చూసాం. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ విస్తృత పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేసినట్లుగా పెద్దగా కనిపించదు. రాహుల్ గాంధీకి అటువంటి ఉద్దేశం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నం చేసినట్లుగా గడిచిన రెండున్నర ఏళ్ల కాలంలో ఎప్పుడూ కనపడట్లేదు. అంతేకాదు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది, రాష్ట్రంలో హామీలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన ఆ పార్టీకే సంబంధించిన నాయకులు సమాచారాన్ని ఇస్తే కూడా తీసుకునే పరిస్థితిలో ఏఐసిసి లేదు అంటూ కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ప్రభుత్వం ఎలా ఉంది, హామీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయాన్ని పైనాయకత్వానికి చెబుదామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాల్ని ఆపేస్తున్నారు, ఆపేస్తున్న వాళ్ళు ఎవరో గమనించలేని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే, రాహుల్ గాంధీ జనం దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు, ప్రజలతో కలిసిపోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దానికి సంబంధించి తన ఎఫర్ట్స్ ని ఎవరం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వందల కిలోమీటర్లు ఒక ట్రక్ లో ప్రయాణం చేసినా, టీ కొట్టు దగ్గరికి వెళ్లి టీ తాగుతూ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, అర్ధరాత్రి సడన్‌గా రోడ్ల మీద ప్రత్యక్షమై క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, నిరుద్యోగుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఓ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశంలో సుదీర్ఘ పాదయాత్ర దేశాన్ని నడుచుకుంటూ దేశమంతా తిరిగి, దేశంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా అనుహ్యం కాబట్టే, రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నమ్ముదాం. నమ్మడానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి, తెలంగాణకు వస్తున్నారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఆయనకు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన ఆటో ఎక్కి ఆటో కార్మికులతో మాట్లాడారు, ఆటో డ్రైవర్లతో మాట్లాడారు, తాము వస్తే ఏం చేస్తామో చెప్పారు, ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా తీరుస్తానో, రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు, వాళ్ళతో కలిసి ఆటోలో ప్రయాణం చేశారు, హైదరాబాద్‌లో ఆయన, అంతే కాదు అశోక్ నగర్ కి వెళ్లి అక్కడ నిరుద్యోగులతో సమావేశం అయ్యారు, వాళ్ళతో కలిసి టీ తాగారు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నారు, మేము అధికారంలోకి వస్తున్నాం, పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం, లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటూ ఆయన చెప్పడం కూడా చూసాం. తెలంగాణ నుంచి నిరుద్యోగాన్ని తరిమి కొడతామంటూ మాట్లాడడం కూడా చూసాం, సో ఇప్పుడు రాహుల్ గాంధీ రెండున్నర ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 50% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టెన్యూర్ అయిపోతున్న సందర్భంలో, ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఒక్క గంట సమయం తీసుకొని, ఒక గంట సమయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి అశోక్ నగర్ వరకు గాంధీభవన్ నుంచి అశోక్ నగర్ వరకు ఆటోలో ప్రయాణం చేస్తే ఆటో డ్రైవర్లతో మాట్లాడి మీరు గతంలో ఇచ్చిన హామీ నెరవేరిందా లేదా తెలుసుకోవచ్చు ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ''రాహుల్‌ పర్యటనపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story