వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడు విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి జరిగింది.

వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన యువకుడు విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి జరిగింది. ఆమెకు ఇప్పటికే 13 ఏళ్ల కుమార్తె ఉంది, కానీ మ్యాట్రిమోనీ సైట్‌లో తను అవివాహిత అని, డబ్బు లేదా నగలు కోసం పెళ్లి చేసుకోవట్లేదని మాయమాటలు చెప్పి మోసం చేసింది. గత నెలాఖురున మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనుమకొండలో రెంట్ ఇంట్లో నెల రోజులు కలిసి ఉన్నారు. ఒక వారం క్రితం పెళ్లి సమయంలో ఇచ్చిన నగలు, ఉన్న డబ్బు తీసుకుని పరారైంది. పెళ్లి సమయంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చారు అయితే వాళ్లు నకిలీ వ్యక్తులని తేలింది. ఆమె గతంలో కూడా పలువురిని ఇలాగే మోసం చేసి, పెళ్లి చేసుకుని నగలు-డబ్బుతో ఉడాయించింది.

Updated On
ehatv

ehatv

Next Story