Supreme Court Shocks to Govt: సీఎం బినామీ కంపెనీకి KLSRకు రూ.6 వేల కోట్ల పనులు..! KTR ఆరోపణలు..! బాంబ్‌ పేల్చిన సుప్రీంకోర్టు..!

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. తన బినామీ కంపెనీ, దివాళా తీసిన కంపెనీ, జీతాలు ఇవ్వలేక బ్యాంకుల్లో 15 లక్షల రుణం తీసుకున్న కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు కట్టబెట్టారని తెలిపారు. 2018లోనే ఈ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఐటీ కూడా ఇదేదో బినామీ కంపెనీలా ఉందని అనుమానం వ్యక్తం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇదే KLSR కంపెనీ పేరుతో ఉన్న ల్యాండ్‌ క్రూజర్ కారులోనే రేవంత్‌రెడ్డి తిరిగేదని ఫొటోలు చూపించి, ఆధారాలతో బయటపెట్టారు. 2023లోనే ఈ కంపెనీ దివాళా తీసిందన్నారు. వాళ్ల దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు. అలాంటి కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు ఇవ్వడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీ అవకతవకలపై దర్య్తాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి 23న సుప్రీం కోర్టు ఆదేశించింది. దివాళ తీసిన కంపెనీకి రూ.6 వేల కోట్ల పనులు ఎలా ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

గత వారం, పదిరోజులుగా వరుసగా మమ్మల్ని విచారణకు పిలిచి డైవర్షన్‌ డ్రామాను దావోస్‌ నుంచి రేవంత్‌రెడ్డి మొదలు పెట్టాడు. మొదట హరీష్‌రావును తర్వాత నన్ను, అనంతరం సంతోష్‌ రావు, అటు తర్వాత మా అధినాయకుడు కేసీఆర్‌ను విచారణకు పిలిపిస్తే మాకు అనుమానం వచ్చింది. ఈ డైవర్షన్‌ గేమ్‌ సీరియస్‌గానే అడుతున్నరు.. ఇంతకీ ఎందుకు ఆడుతున్నరని , ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నరని చెప్పి మాకు డౌటు వచ్చింది. ఆ డౌటు వచ్చిన తర్వాత మేం కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఎందుకోసం ఈ కవర్‌ డ్రైవ్‌లు, ఎక్స్‌ట్రా కవర్‌ డ్రైవ్‌లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మాకు ఒక ముఖ్యమంత్రి పెద్ద బినామీ బాగోతం ఒకటి బయటపడ్డదని… KLSR ఇన్‌ఫ్రా కంపెనీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు కేటీఆర్‌.

KLSR ఇన్ఫ్రా అనే ముఖ్యమంత్రి బినామీ కంపెనీ చెందిన రూ 6 వేల కోట్లు స్కాం బాగోతం బైటపడడంతో.. జనవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. సీబీఐ, SFIO, ఈడీ ద్వారా KLSR ఇన్‌ఫ్రా టెక్ సంస్థపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బినామీ బాగోతం బయటికి రాకుండా ఉండడానికి మా నాయకులకు నోటీసులు, విచారణ పేరుతో డైవర్షన్ డ్రామా చేశారని కేటీఆర్ ఆరోపించారు.

Updated On
ehatv

ehatv

Next Story