CM Revanth Reddy: బిజీ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు పర్యటన ఎక్కడంటే?
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Written By: Yagnik Updated On - Fri - 19 April 24
కాంగ్రెస్ అభ్యర్థి మహహబూబ్నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి నేడు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నామినేషన్ అనంతరం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పొరిక బలరామ్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజులు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈరోజు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు. సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదేరోజు సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొంటారు. 21న భువనగిరిలో చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. 22న ఉదయం ఆదిలాబాద్లో సభకు, 23న నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 24న ఉదయం జహీరాబాద్లో, సాయంత్రం వరంగల్లో జరిగే సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
-
Revanth Reddy : ఆ కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం జనగణన చేపట్టలేదు
-
Traffic Signals : ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్నెట్స్.. ఎండ నుంచి ప్రజలకు ఉపశమనం!
-
PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై కమెడియన్ పోటీ!
-
Sridevi’s Home: అందాలతార శ్రీదేవి భవంతిలో మనం కూడా ఉండొచ్చు!
-
AP Pensions: ఏపీలో వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పింఛన్లు
-
SUN Effect: ఎండలు మరింత పెరగవచ్చు.. హెచ్చరించిన వాతావరణశాఖ
-
North Korea: ఉత్తర కొరియా కింగ్ కిమ్ జోంగ్కు ఏడాదికి 25 మంది వర్జిన్ అమ్మాయిలు కావాల్సిందే..