తెలంగాణ (Telangana)ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా ఈ-వేలం ద్వారా రూ. 1,500 కోట్ల రుణం తీసుకోనుంది.

తెలంగాణ (Telangana)ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా ఈ-వేలం ద్వారా రూ. 1,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ-వేలం ప్రక్రియ RBI యొక్క బ్యాంకింగ్ సొల్యూషన్ (E-Kuber) వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేయబడతాయి. 19 ఏండ్ల కాలానికి రూ.800 కోట్లు, 20 ఏండ్ల కాలానికి రూ.700 కోట్ల బాండ్లను వేలానికి పెట్టింది. ఆర్ బీ ఐ మంగళవారం నిర్వహించే ఈ-వేలం ద్వారా రూ.1500 కోట్లు సేకరించనున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్ బీ ఐ కి ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్లో మూడు దఫాల్లో రూ.4,400 కోట్లు, మేలో రెండు దఫాల్లో రూ.4,500 కోట్ల అప్పు తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్ లో పేర్కొన్నది. ఆర్ బీ ఐ నుంచే రెండు నెలల్లో సుమారు రూ.9 వేల కోట్ల రుణం తీసుకున్నది.
