డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ నుండి తమకు ప్రాణహాని ఉందంటూ మరోసారి ఎస్పీ కార్యాలయం మెట్ల ఎక్కారు జానయ్య బాధితులు

Vatte Janaiah’s victims’ Protest at SP office
డీసీఎంఎస్ చైర్మన్(DCMS Chairman) వట్టే జానయ్య యాదవ్(Vatte Janaiah Yadav) నుండి తమకు ప్రాణహాని ఉందంటూ మరోసారి ఎస్పీ కార్యాలయం(SP Office) మెట్ల ఎక్కారు జానయ్య బాధితులు. తమ భూములను అక్రమంగా, దౌర్జన్యంగా లాకున్న జానయ్యపై తాము నెల రోజులుగా పోరాటం చేస్తున్నా.. ఇప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీ కార్యాలయం ముందు ఫ్ల కార్డులతో బాధితులు నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా.. జానయ్య అనుచరులు కేసులు విత్ డ్రా చేసుకోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ పోరాటానికి సూర్యాపేట ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. జానయ్యకు మద్దతు పేరుతో కొంతమంది డబ్బులకు లొంగి, పార్టీలు, సంఘాల పేరుతో మా మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తిస్తున్నారని, మేము కూడా బహుజనులమే అని తెలిపారు. జానయ్యపై తాము చేస్తున్న పోరాటంలో మాతో చేతులు కలిపి.. ఆయనకు శిక్ష పడే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జానయ్యను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్(Demand) చేశారు. మా పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని ప్రాధేయపడ్డారు.


