బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం అన్ని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పాపన్నపేటలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు . మనలో విభేదాలు పక్కన పెట్టాలని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలన్నారు

బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యమని మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని పాపన్నపేటలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు . మనలో విభేదాలు పక్కన పెట్టాలని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలన్నారు .ప్రజల కోసం కష్టపడే మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. మెదక్ జిల్లా చేసి మెదక్కు రైలను, మెడికల్ కాలేజీని తెచ్చింది కేసీఆర్ అన్నారు ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ శాంక్షన్ చేసిన వంద కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు తీసుకుందన్నారు. అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఏంటి? ధ్వజమెత్తారు .ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. రైతులు కష్టాలపాలయ్యారు.కోతలరాయుడు రేవంత్ వడ్లకు 500 బోనస్ ఇచ్చి 2500కు కొంటానన్నాడు. యాసంగి వడ్లకన్నా ఇవ్వాలి కదా అన్నారు .వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే రాజకీయ వలసలపై దృష్టి పెట్టిండు సరికాదన్నారు.వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఎన్నికల్లో చురకు పెట్టాలన్నారు.


