Anchor Rashmi's Tweet: యుద్ధంపై యాంకర్ రష్మి సంచలన ట్వీట్..! ఎగస్ట్రాలు చేస్తే ఇరాన్‌కు పంపించండి..!

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధవాతావరణం భయపెడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం, అమెరికా జోక్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రెండు దేశాలతో పాటు యుద్ధ ప్రభావం.. యూఏఈ, దుబాయి, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలపై కూడా పడింది. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్‌కి గురిచేస్తున్నాయి.

ఇరాన్‌లో చనిపోయిన వారి కోసం జమ్ముకశ్మీర్, హైదరాబాద్‌లో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో రష్మికి బాగా మండినట్లు ఉంది. దీంతో రెచ్చిపోయి ఒక ట్వీట్‌ వేసింది. ఎవరైతే ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారో వాళ్లను అక్కడికి పంపించేయాలని రాసుకొచ్చింది.

'మన దేశం.. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేం సహించం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం' అని రష్మి తన ట్విటర్‌లో రాసుకొచ్చింది. రాడికల్ (అతివాద) ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్లని దయచేసి ఇరాన్‌కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్ల మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

రాడికల్‌ మైండ్ సెట్‌ ఉన్న దేశాల్లో 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, తనకు ఇప్పటికీ పెళ్లి కాకున్నా, పిల్లల్ని కనకున్నా కూడా తన దేశంలో గౌరవం, మర్యాదతో ఉన్నానని రష్మి తెలిపింది.

Updated On
ehatv

ehatv

Next Story