Trolling Against Nagababu: 'నాగబాబు'ను ట్రోల్‌ చేస్తున్న హిందువులు..! నాస్తికుడు.. హిందూ ధర్మరక్షకుడయ్యాడా..!

కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెతలాగే నాగబాబు వ్యవహారం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై నాగబాబు చేసిన ఓ ప్రకటన ఇందుకు కారణమైంది. తిరుమల లడ్డూ విషయంలో ఆగమాగమైన పవన్‌ కల్యాణ్‌.. సనాతని అవతారమెత్తి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్, తాజాగా సీబీఐ నివేదికలో జంతువుల కొవ్వులేదని తెలపడంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.

చెగువీరా నుంచి సనాతనికి మారిన పవన్‌ కల్యాణ్‌ గతంలో అనేక వ్యాఖ్యలు చేయడం చూశాం. తన తండ్రి పచ్చి కమ్యూనిస్టువాది అని, తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్‌ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. తనకు తానూ ఓ కమ్యునిస్ట్‌ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని చాలా సార్లు చెప్పారు. తాజాగా మొన్న జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పార్టీ నేతలపై వపన్‌ కల్యాణ్‌ రుసురుసలాడరాని సమాచారం. లడ్డు విషయంలో తాను ఎంత అని డిఫెండ్‌ చేసుకోవాలని, తనను డిఫెండ్ చేసే వారు ఎవరూ పార్టీలో లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు వచ్చాయి. చివరికి తన సోదరుడు నాగబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో ఇక నాగబాబు రంగంలోకి దిగారు.

గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో వెంటనే నాగబాబు గతంలో చేసిన వ్యాఖ్యలతో పోలుస్తూ, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను ఒకచోట చేర్చి ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం మీమ్‌ అయిన ''మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందే'' అనే మీమ్‌ను వాడి నాగబాబును ట్రోల్‌ చేస్తున్నారు. అవసరానికి దేవుడిని వాడుకోవడం అన్నా,తమ్ముళ్లకు బాగా అలవాటైందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాస్తికుడు.. హిందూ ధర్మరక్షకుడయ్యాడా..! అంటూ ప్రశ్నిస్తున్నారు.



https://www.youtube.com/shorts/VHXnoW-CE-8?app=desktop#:~:text=%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF..,can't%20play%20this%20video.

Updated On
ehatv

ehatv

Next Story