Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూపై మరో విచారణ! ఎందుకంటే?
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూపై మరో విచారణ! ఎందుకంటే?

తిరుమల లడ్డు కల్తి వ్యవహారంపైన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు చూశాం. నిన్న క్యాబినెట్ లో ఈ అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు, సుదీర్ఘంగా చర్చించిన మీదట ఈ అంశంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, అశోక్ సింఘాల్, మరి కొంతమంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాల్సిందే, లడ్డు కల్తీకి వీళ్లే కారణం, వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ఎలా అంటూ మంత్రివర్గం ఆక్షేపించింది. మంత్రివర్గం ఆక్షేపించి ఈ మొత్తం వ్యవహారం పైన మరొక విచారణ కమిషన్ వేయాలని నిర్ణయించింది. నిజానికి తిరుమల లడ్డు కల్తి జరిగిందనే వార్త అఖిలాండకోటి శ్రీవారి భక్తులకు ఆవేదన కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా ఇలా జరిగి ఉండకూడదు అంటూ భావించారు. ఇలా జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి జరిగిందా లేదా తేల్చడం కోసం సుప్రీం కోర్టు ఆదేశాలతో. సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటయింది. ఈ సిట్ ఏర్పాటయిన తర్వాత, సిట్ సుదీర్ఘంగా అనేక రాష్ట్రాలలో అనేకమంది వ్యక్తులను విచారించి, వందల డాక్యుమెంట్లను పరిశీలించి, ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జంతువుల కొవ్వు కలవలేదనే విషయాన్ని తేల్చింది. జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట అబద్ధం అని తేల్చేసింది. జంతువుల కొవ్వు కలిసింది అనేది మొత్తం శ్రీవారి భక్తులందరూ ఆవేదన చెందడానికి కారణమైన నేపథ్యంలో, అది కాదు అని తేలడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఒక ఉపశమనాన్ని కలిగించింది. కానీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఒక ఉపద్రవాన్ని తీసుకొచ్చింది. ఈ ఉపద్రవం నుంచి బయట పడడం ఎలా అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడింది. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలంతా, టిటీడి చైర్మన్ తో సహా, సీట్ రిపోర్ట్ పట్ట అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. సీట్ రిపోర్టు సరైనది కాదు తరహా ఇంప్రెషన్ ఇస్తూ వచ్చారు. సీట్ వీళ్ళందరినీ ఎందుకు దోషులుగా చేర్చలేదు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. ఏ1 నుంచి ఏ 30 వరకు, టిటిడి చైర్మన్ గాని, ఈఓ గాని, అప్పుడు పని చేసిన కీలకమైన అధికారులు గాని, ఏ ఒక్కరు లేకపోవడం ఏంటి అంటూ నేరుగా ఆవేదన వ్యక్తం చేయకపోయినప్పటికీ, లోలోపల బాధపడుతూ వచ్చారు. ఇదే సమయంలో గతంలో ప్రభుత్వ హాయంలో సిట్ తేల్చింది, గత ప్రభుత్వ హాయంలో భారీగా కోట్ల కొద్ది లడ్డూలు కల్తి నెయ్యితో తయారు చేశారు, కల్తి నెయ్యి కాదు అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేశారు, చుక్క నెయ్యి లేకుండా, కోట్ల లడ్డూల్ని గతంలో తయారు చేశారు అని సిట్ చెప్పినట్లుగా చెప్తున్నారు. సిట్ గతంలో ఆ లడ్డు గత ప్రభుత్వ హాయంలోని లడ్డుని గాని, గత ప్రభుత్వ హాయంలోని నెయ్యిని గాని, సిట్ ఎక్కడ టెస్ట్ చేయించలేదు. ఏ ల్యాబుకి సంబంధించిన టెస్ట్ రిపోర్టు సిట్ దగ్గర లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమానం వచ్చో, లేకపోతే మేము రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ నుంచి, నెయ్యి తీసి పంపించామనో, ప్రభుత్వం చెప్తుంది దాంట్లోనే జంతువుల కవ్వు కలిసింది అని చెప్పింది, బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంపిల్ తీసి, పంపించిన రిపోర్టు, వచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని సిట్ అధికారులు విచారణ చేసి, జంతువుల కొవ్వు అబద్ధం అని తేల్చారు. పార్టీలు బాగా పక్కన పెడితే భక్తులకైతే కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతోంది, ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సిట్, సిబిఐ అండర్ లో ఉంది ఏన్డీ సర్కార్ ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో, సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయింది. సుప్రీం కోర్టే చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇంకెవరు ఇటువంటి బాధ్యత లేని స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఆధారాలు లేని స్టేట్మెంట్లు ఇవ్వకండి అని, ఆ తర్వాత అందరూ నోర్లు మూశారు. మళ్ళీ ఇప్పుడు నోర్లు తెరుస్తున్నారు. జంతువులకు కలిసింది, జంతువులకు కలిసింది అని మళ్ళీ మొదలు పెట్టారు, ఇప్పుడు విచారణ కమిషన్ వేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచారణ కమిషన్ ఎందుకు అవసరం ఉంది. సిట్ సరిగ్గా విచారణ చేయలేదు అనుకుంటున్నారా, సిట్ మీరు ఏర్పాటు చేశారు, సిబిఐ ఆధ్వర్యలో నడిచింది, సుప్రీం కోర్టు ఆదేశాల మీరకు నడిచింది, మరి సిట్ ఎందుకు పట్టించుకోలేదు, మనం గత ప్రభుత్వం పైనో, కొంతమంది వ్యక్తుల పైన, ఆరోపణలు చేశాం కాబట్టి, అవేమి సిట్లో కనపడట్లేదు కాబట్టి, అవి కనపడకపోతే మనం తప్పు చేసినట్లు అవుతుంది, ప్రజల ముందు కాబట్టి, మళ్ళీ మనం ఒక విచారణ కమిషన్ వేసి వాళ్ళందరి పేర్లు పెడదాం అని ప్రభుత్వం అనుకుంటే, అది శ్రీవారి భక్తులకు ద్రోహం చేసినట్టు, రాజకీయంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి కానీ, శ్రీవారి భక్తులతో తిరుమల లడ్డుతో రాజకీయం చేయకండి. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


