ఆంధ్రప్రదేశ్‌(AP)లో కూటమి సర్కార్‌ అధికారంలోకి రాకముందు కూటమి చెప్పిన మాట, అప్పటి ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపబోమని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌(AP)లో కూటమి సర్కార్‌ అధికారంలోకి రాకముందు కూటమి చెప్పిన మాట, అప్పటి ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపబోమని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కొనసగిస్తామన్నారు. ఇంకా కొంత ఇంకా అమౌంట్‌ పెంచి ఇస్తామన్నారు.

ఏపీ ప్రభుత్వం (AP Govt)పర్సన్‌ సెంట్రిక్‌గా అందిస్తున్నా పథకాలేవీ ఆగవన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ కమిటీలన్నీ కొనసాగుతాయన్నారు. వాలంటీర్లు కంటిన్యూ అవుతారన్నారు. పాత పథకాలతో పాటు సూపర్‌ సిక్స్‌ అంటూ కొత్త హామీలను ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ వచ్చారు. దాటవేత ధోరణని అవలంబిస్తున్నారు. పెన్షన్లు మాత్రమే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచారు. రెండు నెలల అరియర్స్ కూడా వేశారు. కానీ దాదాపు 2-3 లక్షల పెన్షన్లు కట్ చేశారని కేంద్రం ప్రభుత్వ గణాంకాలు చెప్పాయి. సిలిండర్లపై కూడా ఈ ఏడాది మూడు సిలిండర్లు ఇస్తామని బడ్జెట్‌లో పెట్టారు. అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలకు పెంచి ఇస్తామన్నారు. అమ్మ ఒడి అందరికీ అంటే ఇంట్లో ఎంత మంది చదువుతుంటే వారందరికీ ఇస్తామన్నారు. రైతు భరోసా(rythu bharosa) ఇప్పటివరకు అమలు కాలేదు. హామీల అమలుకు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా రేషన్ సరుకులు పంపే వాహనాలను కూడా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోగా సేవలను కూడా నిలిపివేస్తారా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story