Chandrababu and Pawan Kalyan's inner feelings: ఏకాకిగా మారుతున్నామా..! చంద్రబాబు-పవన్‌ కళ్యాణ్ ఇన్నర్‌ ఫీలింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏకాకిగా మారిపోయారా? వాళ్ళలో అసహనం ఎందుకు పెరిగిపోతుంది, వాళ్ళు చేస్తున్న ప్రకటనలు, వాళ్ళలోని అసహనాన్ని, మేము ఒంటరి అయ్యాము లాంటి ఒక ఫీలింగ్ ని బయట పెడుతున్నాయి. ఏంటవి, ఇటీవల వరుసగా క్యాబినెట్ సమావేశాల్లోనూ, పార్టీకి సంబంధించిన మీటింగ్స్ లోనూ, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేయడం చూస్తున్నాం, మంత్రులు ఎవరూ మాట్లాడరా, మంత్రులకు ఏం సంబంధం లేదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని కుట్రలు చేస్తుంటే మీరు సైలెంట్ గా ఎందుకుంటున్నారు, లడ్డు అంశానికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించిన అంశానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే, వాటన్నిటిపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంటే, ఏ ఒక్క మంత్రి మాట్లాడకపోవడం ఏంటి అంటూ చంద్రబాబు మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. క్యాబినెట్ ముగిసిన తర్వాత మంత్రులని, ప్రత్యేకంగా పిలుచుకొని క్లాస్ పీకారు, ఇటువంటి వార్తల్ని గడిచిన ఏడాది కాలంలో అనేకం చూస్తున్నాం. ఇటీవల అయితే ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, మంత్రులు ఇన్వాల్వ్ కాకపోతే ఎలా అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఈవెన్ ప్రతి నెల పెన్షన్లు పంచే కార్యక్రమానికి నేనే స్వయంగా వెళ్లి, ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచుతున్నాను, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఆ తీరిక లేకపోతే ఎలా అంటూ చంద్రబాబు నాయుడు అసహన వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. మొత్తం ప్రభుత్వం, మొత్తం యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నారు, 164 మంది ఎమ్మెల్యేలు, 25 మంది మంత్రులు వీళ్ళందరికీ చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు, 24 మంది మంత్రులకి, ఈ స్థాయిలో మొత్తం అధికార పార్టీ యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ పదే పదే మీరు వైసీపీ పైన దాడి చేయకపోతే ఎలా, వైసీపీ పైన అటాక్ చేయకపోతే ఎలా, వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, ఆపకపోతే ఎలా లాంటి మాటల్ని పదే పదే పదే పదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వస్తున్నారు. అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా, నేనే వెళ్ళాలా, నేను మాట్లాడకపోతే, ఎవరూ మాట్లాడరా, అంటూ ఆయన అసహనం వ్యక్తం చేయడం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం నుంచి లేకపోతే, తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడం కోసం, మా పార్టీ మా నాయకులు ఎవరూ ముందుకు రావట్లేదేంటి అనే బాధ, ఆవేదన చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది. మేమే ఒంటరిగా అయిపోయామా, ఇది నాకు సంబంధించిన పర్సనల్ ఎఫైరా, నేను మాత్రమే మాట్లాడాలా, మీరు ఎందుకు మాట్లాడకూడదు అనే ఆవేదన కూడా ఆయనలో కనబడుతుంది. ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు మిగతా వాళ్ళు ఎవరు, వైసార్ కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేసే ప్రయత్నం చేయట్లేదు, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొంతమంది తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఫోన్ చేసి వాళ్ళకి టచ్ లోకి వెళ్లి, మా మీద కోపం పెట్టుకోకుండి, మేము కొన్ని ప్రకటనలు చేస్తే చేయాల్సి వస్తుంది తప్ప, మేము మనసులో నుంచి చేసినవి కాదు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ గతంలో మాట్లాడుకున్నాం మనం. బహుశా మొత్తం నెగిటివిటీ నేనే తీసుకోవాల్సి వస్తుంది, నేనే ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది అనే ఆవేదన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అది ఆయన పదే పదే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా, గొంతు కలుపుతుంది, తెలుగు దేశం పార్టీ మీడియా తప్ప, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కాదు, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కాదు లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది. అదే ఇంప్రెషన్ ఆయన మాటలను చూస్తే కలుగుతుంది కూడా. ఇక నిన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశం అయ్యారు. బయట ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో దాదాపు ఒక గంట గంటన్నర సేపు ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన నాయకులు అందరితో మాట్లాడి ఆయన అన్నిటికీ నేనే మాట్లాడాలా. మీరు ఎవరు మాట్లాడరా అంటున్నారు. నేను ఒక్కడినే సమాధానం చెప్పాలా. మీరు ఎవరు సమాధానం చెప్పరా అంటున్నారు. ఎమ్మెల్యేలకు బాధ్యత లేకపోతే ఎలా అంటున్నారు. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కొన్ని పత్రికలు, రిపోర్ట్ చేసినట్టుగా నాగబాబు గారి పైన కూడా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అని రాశారు. సోషల్ మీడియాలో మహిళల బట్టల పైన మాట్లాడతావు, నాగబాబు లడ్డు విషయంపైన ఎందుకు మాట్లాడవు అని, నాగబాబుని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లుగా వార్తలు చూశారు. ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తుంటే, లడ్డు అంశానికి సంబంధించి, ఇంత జరుగుతుంటే, పార్టీ నాయకులు ఎవరు మాట్లాడకపోతే ఎలా, అన్నిటికి నేనే మాట్లాడాలా, నేనే సమాధానం చెప్పాలా, మీకు ఎవరికీ బాధ్యత లేదా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూస్తున్నాం. సో ఆయన కూడా పార్టీలో నేను ఒంటరిని అయ్యానా ఏకాకిగా ఉన్నానా, నేనే ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా నన్ను టార్గెట్ చేస్తే, నన్ను ప్రొటెక్ట్ చేసే లేయర్ ఒకటి లేకుండా పోతుందా, నిజానికి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది, ఓ నలుగురు, ఐదుగురు అధికార ప్రతినిధులు పార్టీ వాయిస్ ని అధినేత మనసులోని, మాటని అధినేత,ను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాన్ని మీడియాలో చేస్తున్నారు తప్ప, పార్టీ అంతరంగంగా ఎక్కడా చేయట్లేదు లాంటి ఇంప్రెషన్ పవన్ కళ్యాణ్‌లో, ఆయన వ్యాఖ్యల్లో కనపడుతుంది. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story