Chandrababu New Strategey : జగన్ అరెస్టుపై కూటమి ప్రభుత్వం కొత్త స్ట్రాటజీ..!
ఆంద్రపద్రశ్ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై కూటమి సర్కార్ నుంచి మౌనం వహించింది. ఈ అంశంలో కూటి ప్రభుత్వం కాస్త సెలైన్స్ అయింది.

ఆంద్రపద్రశ్ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై కూటమి సర్కార్ నుంచి మౌనం వహించింది. ఈ అంశంలో కూటి ప్రభుత్వం కాస్త సెలైన్స్ అయింది. కొన్ని రోజుల క్రితం అరెస్టు విషయంపై మాట్లాడిన టీడీపీ (TDP)మీడియా గత కొంతకాలంగా మౌనంగా ఉంది. మళ్లీ నిన్న, ఈరోజు రాయడం ప్రారంభించింది. మద్యం స్కాం.. మద్యం ఇష్యూ.. టీడీపీ ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంపై సీఐడీ (CID)విచారణ జరిగింది. ఆ సీఐడీ విచారణలో ఏం తేలిందో తెలియదు కానీ.. సడన్గా సిట్ విచారణ వేశారు. అయితే సిట్ కొన్ని అరెస్టులు చేసింది. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంది. సిట్ అరెస్టులు చూసిన తర్వాత రేపో, మాపో జగన్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Nara lokesh) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ(Delhi)లో ప్రధాని మోడీని(PM Modi), హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను కలిశారు. వాళ్లకు కూడా ఒక మాట చెప్పి, వాళ్ల అనుమతి కూడా తీసుకొని జగన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ఏజెన్సీలు జగన్ను అరెస్ట్ చేస్తే రెండు, మూడు నెలల్లో ఆయనకు బెయిల్ రాక తప్పదు.. కానీ అదే స్థానంలో ఈడీ లాంటి ఏజెన్సీతో అరెస్ట్ చేస్తే ఎక్కువ కాలం జైలులో ఉంచొచ్చు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని టీడీపీ చెప్పనప్పటికీ, టీడీపీ మీడియా చెప్తూ వస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, టీడీపీ మీడియా మాత్రం ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఈడీ ఎంటరైంది. ఈడీ ఎంటరయినా అది యాక్టివ్గా కనపడడం లేదు. దీనికి కారణమేంటంటే..తమిళనాడు(Tamilnadu)లో మద్యం కేసుకు సంబంధించి ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. దేశవ్యాప్తంగా ఈడీ బీజేపీ(Bjp)కి అనుకూలంగా మారుతూ ఇతర పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసుకు సంబంధించి కూడా కొంత వెనక్కి తగ్గినట్లు అనిపిస్తోంది. అయితే జగన్ అరెస్ట్పై తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలను ఎలా చూస్తాం.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణలో...
