బనకచర్ల చర్చ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

బనకచర్ల చర్చ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో సరైన రీతిలో స్పందించలేదని, బీఆర్‌ఎస్‌(BRS) స్పందించిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆ పార్టీ సీనియర్‌ నేత హరీష్‌రావు(Harish rao) విమర్శించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌(CM Revanth) వ్యాఖ్యలకు నిరసనగా ఆ సమావేశం నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బాయ్‌కాట్ చేశారు. ఈ సమావేశం తర్వాత సీఎం రేవంత్‌ మాటలు విన్న తర్వాత అర్థం అయింది ఏంటంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌గా మాట్లాడారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని రాద్ధాంతం చేస్తోందని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం (AP Govt)ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తుంటే ప్రభుత్వం ఎజెండా ఎలా ఉండాలి. అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. అంతే కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. అన్ని పార్టీలు కలిపి కేంద్రంపై ఒత్తిడి చేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోలేదు, ఈ ఎజెండాను ప్రభుత్వం డిస్టర్బ్‌ చేసినట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)తో వివాదం నడుస్తుంటే ప్రశ్నించాల్సింది ఎవరిని.. అడగాల్సింది ఎవరిని.. ఫైట్‌ చేయాల్సింది ఎవరిని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి లేదా ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న కేంద్రంపై పోరాడాలి.. కానీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టార్గెట్‌గా విమర్శలు చేస్తోంది. తాము చెప్పిన తర్వాత ప్రభుత్వం కేంద్ర జల వనురులశాఖకు లేఖ రాసిందని, దాన్ని హర్షిస్తున్నామని కూడా బీఆర్‌ఎస్‌ చెప్పింది. ప్రతిపక్షాన్ని కౌంటర్‌ చేయడం దేనికి.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story