Journalist YNR : జగన్ అడిగితేనే కదులుతారా..!
ఏపీలో రైతుల సమస్యలపై వైసీపీ ఆందోళన చేస్తామని ప్రకటించింది. గడిచిన కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లో మిర్చి పంటల ధరలు గణనీయంగా పడిపోయాయి.

ఏపీలో రైతుల సమస్యలపై వైసీపీ ఆందోళన చేస్తామని ప్రకటించింది. గడిచిన కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లో మిర్చి పంటల ధరలు గణనీయంగా పడిపోయాయి. గతంలో 20 వేలు, 22 వేల వరకు పలికింది. యావరేజ్గా రూ.18 వేలకు ఎక్కడా తగ్గలేదు. ఈ ఏడాది ఎనిమిది నుంచి 12 వేల లోపే క్వింటాలు ధర పడిపోయింది. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. మిర్చి అధికంగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ముందు వరుసలో ఉంటుంది. ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి అవుతుంది. గిట్టుబాటు ధర రాక ప్రజలు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. దీంతో వైసీపీ(YCP) ఆందోళనలు చేపడతామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖరాశామని ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయంలేదు. కేంద్రానికి లేఖరాశామని ప్రభుత్వం చెప్పుకుంది. జగన్(Ys Jagan) ప్రకటన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి మిర్చీ రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం చేసిన సాయమేంటి. కేంద్రం ఏం ఆదుకుంది. కేంద్రం అదనంగా బోనస్ ఇచ్చిందా.. క్వింటాల్కు అదనపు బోనస్ ఇచ్చారా అంటే అదేమీ లేదు. రైతుల చేతుల్లో ఉన్న పంట దళారుల్లోకి వెళ్లింది. కోల్డ్ స్టోరేజ్లలో నిండిపోయాయి.18 వేలకుపైగా పలికింది.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
