ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్ చాంబర్‌ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ)తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్ చాంబర్‌ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ)తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే ఇచ్చే సౌకర్యాలు, ఇంటెన్సివ్స్ గురించి వివరించాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. తమ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే అక్కడి ప్రజలకు ఉపాధి దొరకడమే కాకుండా.. రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ఫిక్కీ ప్రతినిధులతో, పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రులు సమావేశం కావడం సహజం. డెవలప్మెంట్‌లో భాగంగా ఈ సమావేశాలు జరుగుతుంటాయి.. ఇతర ప్రాంతాల్లో కంటే తమ ప్రాంతంలో లేదా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే జరిగే ప్రయోజనాల గురించి వివరించాలి. కానీ సీఎం చంద్రబాబు ఫిక్కీ ప్రతినిధులతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను మీకు భరోసా ఇస్తున్నా జగన్‌ ఇక ముందు అధికారంలోకి రాలేడు.. జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.. మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టాలని వారికి చెప్పారు. అయితే జగన్‌ ఉన్నాడు కాబట్టి గతంలో ఫిక్కీ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేదా.. జగన్‌ ఉన్నాడు కాబట్టి ఫిక్కీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ వైపు కన్నెత్తి చూడలేదా.. గతంలో ఫిక్కీతో జగన్‌ సమావేశాలు నిర్వహించలేదా.. చంద్రబాబు వ్యాఖ్యలను ఫిక్కీ ఎండార్స్‌ చేస్తుందా.. చంద్రబాబు వ్యాఖ్యలపై ఫిక్కీ సమాధానం చెప్పాలి కదా.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story