ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ (PM modi)ఆధ్వర్యంలో చేపట్టిన యోగా (Yoga)కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ (PM modi)ఆధ్వర్యంలో చేపట్టిన యోగా (Yoga)కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌ అయింది. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇది గిన్నిస్‌ బుక్‌లోకి కూడా ఎక్కింది. ఈ విషయాన్ని టీడీపీ కూడా విజయవంతంగా ప్రచారం చేసింది. అయితే ఈ కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని వైసీపీ ఆరోపించింది. 300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాదు కాదు కేవలం 75 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని.. ఆ 75 కోట్లు కూడా కేంద్రం రీఎంబర్స్‌ చేస్తుందని టీడీపీ(TDP) చెప్పుకొచ్చింది. వైసీపీ (Ycp)అబద్దాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అంటోంది. అయితే కూటమికి సంబంధించిన కొందరు నేతల ఎలివేషన్స్‌ చూసిన తర్వాత కూటమిలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న జనసేన(Janasena)కు నేను ఈరోజు ఓ సలహా ఇవ్వదల్చుకున్నాను. జనసేనకంటూ మీడియా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం తెలుగుదేశం పార్టీకి భజన చేయడానికే ఈ 80 శాతం మీడియా పనిచేస్తుంది. మిగిలిన 10-15 శాతం జగన్‌(Ys Jagan)కు సంబంధించిన మీడియా ఉంది. ఇతర మీడియా సంస్థలున్నా కానీ వాటిని పార్టీ కోణంలో చూడలేం. అయితే జనసేన పెట్టిన నాటి నుంచి పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టర్‌ అసాసినేషన్‌ జరుగుతూనే ఉంది. ఆయన పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ(Telangana)లో ఉద్యమ పార్టీకి టార్గెట్‌గా మారారు, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ(Congress)కి కూడా టార్గెట్‌గా మారారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న చిరంజీవి కూడా స్వయంగా పవన్‌ తప్పుడు మార్గంలో వెళ్తున్నారాన్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఉన్న మీడియా కేవలం సొంత మీడియా, సోషల్‌ మీడియా మాత్రమే ఉంది. ఆయన చెప్పిన విషయాలను సోషల్‌ మీడియాలోనే ఆయన అభిమానులు ప్రచారం చేశారు. అయితే టీడీపీ మీడియా ఎందుకో పవన్‌ను పక్కన పెట్టిందనే చెప్పాలి.. ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On 23 Jun 2025 9:58 AM GMT
ehatv

ehatv

Next Story