Jagan on SaiReddy: విజయసాయిరెడ్డి లొంగిపోయాడా..!

విజయసాయిరెడ్డి వైఎస్‌ఆర్సీలో నెంబర్. 2గా ఉండేవారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇటీవల రాజీనామా చేసే వరకు ఆయన పార్టీలో నెంబర్‌.2గా ఉన్నారు. అంతేకాకుండా జగన్‌తో పాటు అనేక కేసుల్లో ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్ తన ప్రెస్‌మీట్‌లో నేరుగా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డికి ఫైట్‌ చేయడం చేతగాక లొంగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే మూడున్నరేళ్ల పదవీ కాలాన్ని కాదనుకున్నారు. విజయసాయిరెడ్డిలో ఫైట్‌ స్పిరిట్‌ లేదన్నారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా సార్లు ఆయన ప్రెస్‌మీట్‌లు పెట్టారు. తొలిసారి ప్రెస్‌ మీట్‌లో జగన్‌ను ఎంతో పొగిడారు కూడా. ఆయన జగన్‌ గురించి ఒక్క మాట నెగెటివ్ మాట కూడా మాట్లాడలేదు. కాకపోతే జగన్‌ చుట్టూ కోటరీ తయారైందని, ఆ కోటరీ వల్ల జగన్‌ ప్రజలకు దూరమయ్యారని, కోటరీలోని వ్యక్తులు కొందరు నేతలపై చాడీలు చెప్పేవారని, కోటరీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, కోటరీ అవినీతి కారణంగా జగన్‌కు అప్రతిష్ట వచ్చింది, కోటరీ వల్ల జగన్‌ ప్రతిష్టకు మసకబారిందన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలను ఎలా చూస్తాం.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On 23 May 2025 7:30 AM GMT
ehatv

ehatv

Next Story