Internal turmoil in TDP: అంబటి విషయంలో అతి చేశామా..! టీడీపీలో అంతర్మథనం..!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత అధికార కూటమి పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. ఆ వ్యతిరేకత నాకు, మీకు కంటే కూడా ప్రభుత్వానికే ఎక్కువ తెలుస్తుంది. ప్రభుత్వానికే ఎక్కువ అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన, ఆఫీస్ పైన జరిగిన దాడి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి, ఇవి రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మచ్చగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఓపెన్ గా వందల మంది, ఇళ్లపైన పడి దాడులు చేస్తుంటే చోద్యం చూసింది అని ప్రపంచంంతా అనుకుంది. ప్రపంచంంతా అనుకోవడానికి కారణం దాడులు జరుగుతున్న సందర్భంగా పోలీసులు సైలెంట్‌గా, మౌనవ్రతం పాటిస్తూ ఉన్నట్టు కనబడింది. జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులు విసురుతున్న సందర్భంగా, వందల మంది అక్కడికి చేరుకున్న సందర్భంగా, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు, వీడియోలో అందరం చూస్తున్నాం, కంట్రోల్ చేసే ప్రయత్నం, ఆపే ప్రయత్నం కంటే కూడా, అక్కడ పోలీసులు చేతగాని వాళ్ళలాగా నిలబడ్డారు లాంటి విమర్శలని ఎదుర్కొంటున్నారు. నేరుగా ఇంటిపైకి ఒక రెండు, మూడు వందల మంది వచ్చి దాడులు చేసే పరిస్థితి ఉంటే, పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఉండాలి కదా, పైగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, మనం అని చెప్పుకుంటూ ఓపెన్ గా కర్రలు, రాళ్లతో దాడులు చేసే పరిస్థితి ఉంటుంటే, శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నట్టు. అంతేకాదు అంబటి రాంబాబు వ్యాఖ్య వెనక్కి తీసుకున్న తర్వాత , ఆయన కార్యాలయం పైన దాడి చేయడం కావచ్చు, ఆయన ఇంటి పైన దాడి చేయడం కావచ్చు, నేరుగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి, దాడిలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, అవసరమైతే దాడులు, అవసరమైతే కదా దాడులు చేస్తాను, తప్పేటి ఇలాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, రాష్ట్ర స్థాయిలో బాధ్యతల్లో ఉన్న కొంతమంది నాయకులు కర్రలు పట్టుకొని ,రోడ్లపైన తిరగడం కావచ్చు, అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రతిష్టని మసకబారలే చేశాయి. ఇలా చేయడం ద్వారా, ఒక బెదిరించడం ద్వారా, ఒక స్కేర్ క్రియేట్ చేసి, ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేయకుండా చేద్దాం అనుకుంది కూటమి ప్రభుత్వం. పైగా విమర్శలు చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొద్దాం అనుకుంది కూటమి. గతంలో మా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు కాబట్టి, మేము దాడి చేస్తే మాత్రం తప్పేంటి అని ప్రజలు న్యూట్రలైజ్ అవుతారు, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు అనుకుంటారు అని భావించింది తెలుగుదేశం పార్టీ. కానీ శృతి మించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి సంబంధించిన పెద్దలకు తెలియకుండా, కర్రలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి, వేరే పార్టీల నాయకుల ఇళ్లపైన దాడులు చేసి, నిప్పులు పెట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలంతా అనుకునేలా చేసింది. ఇవన్నీ గమనించిన తర్వాత, రకరకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తర్వాత, ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరే, పార్టీ కార్యాలయాలకు ఫోన్లు చేసి, మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల వల్ల, మీరు పర్టికులర్ గా, మీకు బలం ఉందనో, అక్కడ స్ట్రెంత్ ఉందనో, పోలీసులు ఉన్నారనో, గుంటూరు, కృష్ణ లాంటి జిల్లాల్లో అలజడ్లు చేస్తే, దానికి సంబంధించిన పర్యవసానాల్ని, రేపు పొద్దున ప్రభుత్వం మారితే, మేమంతా ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీ దగ్గరలాగా పైపై దాడులు ఉండవు మేము ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఊర్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అతి చేయకండి అంటూ పార్టీ నాయకత్వాన్ని ఇతర ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కోరుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్ట కూడా మసకబారింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. ఈ దాడుల్ని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎక్కడా సమర్ధించలేదు, అధికారికంగా భారతీయ జనతా పార్టీ తప్పేంటి, వాళ్ళు అట్లా మాట్లాడారు, వీళ్లు ఇంటి మీద పోయి కొడితే తప్పేంటి, తగలబెడితే తప్పేంటి, రాళ్ళ వేస్తే తప్పేంటి అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలే, ఈవెన్ పవన్ కళ్యాణ్, ఈవెన్ డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ లైన్ లోకి వచ్చి వాళ్ళ మాటల కారణంగానే దాడులు ఉన్నాయి అంటూ ఆయన మాట్లాడారు, ఆయన కూడా తనకు సంబంధించిన క్రెడిబిలిటీని లూస్ అయ్యారు, అలాంటి ఇంప్రెషన్ కనిపించింది. కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక ట్వీట్ చేశారు, ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల భాష ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించేది కాదు, సేమ్ టైం వ్యక్తిగతంగా, వాళ్ళ ఇళ్లపైనకి వెళ్లి దాడులు చేయడం కూడా ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అని కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, కూటమిలోని ప్రధాన భాగస్వామి పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన విధ్వంస కాండకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ అది. వీటన్నిటిని చూసిన తర్వాత ఏదో తేడా కొడుతోంది. మరీ అతి చేశామా, ఈ అతికారణంగా నష్టపోబోతున్నామా, ఈ అతికారణంగా జరిగే నష్టం కేవలం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, అంతకుమించి ఉండబోతుందా అనే భయం, అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story